దేశం గర్వించదగ్గ మేధావి శ్రీనివాస రామానుజన్- 22 డిసెంబర్ రామానుజన్ జన్మదినం సందర్భంగా స్పెషల్ స్టోరీ
🌀20
వ
శతాబ్దంలో
ప్రపంచ
ప్రసిద్ధి
గాంచిన
గణిత
మేధావుల్లో
శ్రీనివాస
రామానుజన్
ఒకరు.
అతి
అపార
ప్రతిభాపాటవాలతో
గణిత
శాస్త్రంలో
అనేక
కొత్త
సిద్ధాంతాలను
కనిపెట్టారు.
20 వ
శతాబ్దంలో
ప్రపంచ
ప్రసిద్ధిగాంచిన
గణిత
మేధావుల్లో
ఒకరిగా
పేరు
సంపాందించిన
భారతీయుడు
శ్రీనివాస
రామానుజన్.
తమిళనాడులో
ఈరోడ్లోని
ఓ
నిరుపేద
బ్రాహ్మణ
కుటుంబానికి
చెందిన
కోమలమ్మాళ్,
శ్రీనివాస
అయ్యంగార్
దంపతులకు
1887 డిసెంబరు
22 న
రామానుజన్
జన్మించారు.
చిన్న
వయసులోనే
అసాధారణ
ప్రతిభను
ప్రదర్శించి
ఆయిలర్
నియమాలు,
త్రికోణమితికి
చెందిన
సమస్యలను
సాధించారు.
🌀జీఎస్
కార్
రచించిన
సినాప్సిస్
ఆఫ్
ప్యూర్
మ్యాథ్మెటిక్స్
అనే
పుస్తకం
శ్రీనివాస
రామానుజన్లోని
ప్రతిభను
బయటకు
తీసుకొచ్చింది.
ఆ
పుస్తకంలో
ఆల్జీబ్రా,
అనలిటికల్
జామెట్రీ
లాంటి
విషయాలకు
సంబంధించిన
6165 సిద్ధాంతాలను
నిరూపించడానికి
పెద్ద
పెద్ద
ప్రొఫెసర్లు
సైతం
నానా
తంటాలు
పడేవారు.
అయితే
వారు
అర్థం
చేసుకోలేకపోయిన
సూత్రాలకు
రామానుజన్
ఎలాంటి
పుస్తకాల
సహాయం
లేకుండా
అలవోకగా
పరిష్కరించేవాడు.
🌀కుంభకోణంలోని
ప్రభుత్వ
కాలేజీలో
చేరిన
రామానుజన్
తన
దృష్టి
కేవలం
గణితంపై
కేంద్రీకరించడంతో
ఎఫ్.ఎ.
పరీక్షల్లో
ఉత్తీర్ణుడు
కాలేదు.
ఆ
తర్వాత
మద్రాస్లోని
వచ్చయ్యప్ప
కళాశాలలో
చేరి
అక్కడ
అధ్యాపకుడు
ఎన్.రామానుజాచారి
గణిత
సమస్యలను
కఠినంగా
చెప్తుంటే,
రామానుజన్
వాటిని
సులభమైన
రీతిలో
తక్కువ
సోపానాలతో
సాధించే
వాడు.
రామానుజన్
ప్రతిభను
గుర్తించిన
ప్రొఫెసర్
సింగారవేలు
మొదలియార్
ఆయనతో
కలిసి
మ్యాథమెటికల్
జర్నల్స్లో
క్లిష్టమైన
సమస్యలపై
చర్చించి
వాటిని
సాధించేవారు.
🌀1909లో
జానకి
అమ్మాళ్ను
అనే
మహిళను
రామానుజన్
వివాహం
చేసుకున్నారు.
మ్యాజిక్
స్క్వేర్స్,
కంటిన్యూడ్
ఫ్రాక్షన్స్,
ప్రధాన
సంఖ్యలు,
పార్టిషన్
ఆఫ్
నంబర్స్,
ఎలిప్టిక్
ఇంటిగ్రల్స్
లాంటి
విషయాలపై
పరిశోధనలు
కొనసాగించారు.
1913లో
మద్రాస్
వచ్చిన
ప్రసిద్ధ
గణిత
శాస్త్రవేత్త
డాక్టర్
వాకర్
ఈ
పరిశోధనలు
చూసి
ఆశ్యర్యాన్ని
వ్యక్తం
చేశాడు.
రామానుజన్
కనుగొన్న
120 పరిశోధన
సిద్ధాంతాలను
ఆయన
కేంబ్రిడ్జి
యూనివర్సిటీ
ప్రొఫెసర్
గాడ్
ఫ్రెహెరాల్డ్
హార్టీకి
పంపాడు.
🌀మహా
మేధావులకు
మాత్రమే
సాధ్యమయ్యే
పరిశోధన
ఫలితాలను
చూసిన
హార్టీ
రామానుజన్ను
కేంబ్రిడ్జి
యూనివర్శిటీకి
ఆహ్వానించారు.
1914 మార్చిలో
లండన్కు
వెళ్లిన
రామానుజన్
అక్కడ
నిరంతరం
గణితంపై
పరిశోధనలు
చేసి
కొత్త
సిద్ధాంతాలను
కనిపెట్టారు.
ఫెలో
ఆఫ్
ద
ట్రినిటీ
కాలేజి
గౌరవం
పొందిన
తొలి
భారతీయుడిగానూ,
ఫెలో
ఆఫ్
ద
రాయల్
సొసైటీ
గౌరవం
పొందిన
రెండవ
భారతీయుడిగానూ
ఆయన
చరిత్రకెక్కారు.
బ్రిటన్
నుంచి
1919 మార్చిలో
భారతదేశానికి
తిరిగి
వచ్చారు.
🌀మనదేశ
గొప్పదనాన్ని
ప్రపంచానికి
చాటిన
చెప్పిన
రామానుజన్
అనారోగ్యంతో
తన
33 వ
ఏట
కన్నుమూశారు.
బ్రిటన్లో
ఉన్నప్పుడు
ఆరోగ్యం
గురించి
ఏమాత్రం
లెక్కచేయకుండా
గణిత
పరిశోధనలకు
ప్రాధాన్యత
ఇవ్వడంతో
తీవ్ర
అనారోగ్యానికి
గురయ్యారు.
దీంతో
ఆయన qAఇండియాకు వచ్చిన
ఏడాది
తర్వాత
అంటే
1920 ఏప్రిల్
26న
అస్తమించారు.
జీవిత
చరమాంకంలో
రామానుజన్
రాసిన
మ్యాజిక్
స్క్వేర్,
ప్యూర్
మాథ్స్కు
చెందిన
నెంబర్
థియరీ,
మాక్
తీటా
ఫంక్షన్స్
చాలా
ప్రసిద్ధి
పొందాయి.
🌀వీటిని
ఆధారంగా
చేసుకుని
కనుగొన్న
స్వింగ్
థియరీ,
క్యాన్సర్పై
పరిశోధనలు
ఇప్పటికీ
కొనసాగుతున్నాయని
1986-87 రామానుజన్
శతజయంత్యుత్సవాల్లో
గణిత
శాస్త్రవేత్తలు
ప్రకటించారు.
గణితశాస్త్రంలో
రామానుజన్
సేవలకు
గుర్తింపుగా
భారత
ప్రభుత్వం
ఆయన
పుట్టినరోజును
*జాతీయ
గణిత
దినోత్సవం
గా
ప్రకటించింది.
🌀తీవ్రమైన
అనారోగ్యంతో
ఉన్నపుడు
కూడా
హార్డీకి
1729 సంఖ్య
ప్రత్యేకతను
తెలిపి
ఆయన్ని
ఆశ్చర్యపరిచారు.
ఈ
సంఘటన
గురించి
హార్డీ
తన
మాటల్లో
ఇలా
చెప్పారు:
నేనోసారి
రామానుజన్ను
చూసేందుకు
ట్యాక్సీలో
వెళ్ళాను.
దాని
నెంబరు
1729. ఈ
నెంబరు
చూడటానికి
డల్గా
కనిపిస్తోంది
ఇది
దుశ్శకునమేమీ
కాదుగదా
అని
అన్నాను.
దానికి
బదులుగా
రామానుజన్
ఇలా
అన్నాడు
ఇది
చాలా
ఆసక్తికరమైన
సంఖ్య;
రెండు
సంఖ్యల
ఘనాల
మొత్తాన్ని
రెండు
వేరువేరు
విధాలుగా
చెప్పగలిగే
సంఖ్యల్లో
ఇది
అన్నిటికంటే
చిన్నది
అని
దాన్ని
ఈ
విధంగా
విశదీకరించారు
1729 = 103+93 = 123+13. వీటిని ట్యాక్సీక్యాబ్
సంఖ్యలు
అని
పిలుస్తారు.
గణితంపై ఆయనుకున్న అవ్యాజమైన
అనురాగానికి,
అంకిత
భావానికి
ఇది
నిదర్శనం.
EmoticonEmoticon