ఆంధ్రప్రదేశ్ చరిత్ర - కృష్ణదేవరాయల కొలువులో మహాకవులు ఎవరు

*శ్రీకృష్ణదేవరాయల కొలువులో మహాకవులు ఎవరు?*


శ్రీ కృష్ణదేవరాయల కొలువులోని మహాకవులను అష్టదిగ్గజాలని అంటారు .

▪అల్లసాని పెద్దన : మనుచరిత్ర అనే ప్రబంధాన్ని రచించాడు . ఇతనికి ఆంధ్ర కవితా పితామహుడు అనే బిరుదు ఉంది .

▪నంది తిమ్మన : ఈయనను ముక్కుతిమ్మన అని కూడా అంటారు . పారిజాతాపహరణం అనే గ్రంధాన్ని రచించాడు .

▪పింగళి సూరన : ఇతడు రాఘవ పాండవీయము అను ద్వర్ధి(శ్లేష)కావ్యమును , కళాపూర్ణోదయము , ప్రభావతీ ప్రద్యుమ్నము అనే గ్రంధాలు రచించాడు .

▪మాదయగారి మల్లన : ఇతడు రజశేఖర చరిత్ర అనే గ్రంధాని రచించాడు .

▪ధూర్జటి : శ్రీకాళహస్తి మహాత్యము , శ్రీకాళహస్తీశ్వర శతకము లను రచించాడు .

▪అయ్యలరాజ రామభద్రుడు : ఇతడు ' రామాభ్యుదయాన్ని రచించాడు ,

▪తెనాలి రామకృష్ణుడు : వికట కవి . పాండు రంగ మహత్యం కావ్యాన్ని రచించాడు .

▪రామరాజ భూషణుడు : భట్టుమూర్తి ఇతని నామాంతరము . వసువరిత్ర అనే శ్లేష కావ్యమును , హరిశ్చంద్రోపాఖ్యానము అనే ద్వర్ధి కావ్యము రచించాడు .

no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv