AP History - వివిధ శాసనాలు

➖➖➖➖➖
*శాసనాలు:చరిత్ర*
➖➖➖

*●నాసిక్ శాసనం:*
 గౌతమీ పుత్రశాతకర్ణి విజయాలను తెలియజేస్తూ ఇతని తల్లి గౌతమి బాలశ్రీ వేయించినది.ఈ శాసనమును రెండవ పులోమావి కాలంలో వేయించింది.గౌతమి బాలశ్రీ తనను తాను రాజర్షి వధువుగా పేర్కొంది.

*●నానాఘట్ శాసనం:*
మొదటి శాతకర్ణి విజయాలను తెలియజేస్తూ ఇతని భార్య నాగానిక వేయించినది.ఈయన రెండు అశ్వమేధాలు  ఒక రాజసూయయాగం చేసినట్లు ఈ శాసనం తెలుపుతుంది.

*●కార్లే శాసనం:*
గౌతమీ పుత్రశాతకర్ణి విజయాలను గురించి తెలుపుతుంది.

*●ఐహూల్ శాసనం:*
 2వ పులకేశి  విజయాలను తెలుపుతుంది. ఈ శాసనాన్ని రవి కీర్తి రచించాడు.

*●హథిగుంపా  శాసనం:*
దీనిని వేయించిన కళింగ చక్రవర్తి ఖరవేలుడు. ఇతనికి బిక్షురాజు, మహ మేఘవాహాన అను బిరుదులు కలవు. ఈ శాసనం ప్రాకృతిక భాష (బ్రాహ్మిలిపి)లో రచింపబడినది. ఈ శాసనం ఉదయగిరి వద్ద లభించింది. ఖారవేలుడు దిగ్విజయ సూచకంగా రాజసూయయాగం చేసినట్లు ఈ శాసనం ద్వార తెలుస్తుంది.

*●అలహద్ శాసనం:*
సముద్ర గుప్తుని విజయాలను గురించి తెలుపును. ఈ శాసనాన్ని  హరిసేనుడు రచించాడు.

*●చేజేర్ల శాసనం:*
కందరుడు వేయించాడు. కందరుని విజయాలను గురించి తెలియజేస్తుంది.
బయ్యారం చెరువు శాసనం:
దీన్ని గణపతిదేవుని సోదరి మైలాంబ వేయించింది.

*●జునాఘడ్ శాసనం:*
రుద్రదమనుడు  వేయించాడు.

*●సాంచీ శాసనం:*
రెండవ శాతకర్ణి వేయించాడు. ఈ శాసనం ఇతనిని "రాజస్యశ్రీ శాతకర్ణి"  గా పేర్కొంది.

*శాసనాలు*

*యజ్ఞశ్రీ శాతకర్ణి:*
చినగంజాంలో దొరికిన శాసనం యజ్ఞశ్రీ శాతకర్ణి గురించి తెలుపుచున్నది.
హైదరాబాద్  శాసనం:
రెండవ పులకేశి క్రీ.శ. 609 లో రాజ్యానికి వచ్చినట్లు తెలిపే శాసనం.

*మంచి కళ్ళు శాసనం:*
సిం హవర్మ వేయించిన పల్లవుల తొలి శాసనం (విజయపురి సమీపంలో)
అశోకుని గిర్నాల్ శాసనం:
పశ్చిమ భారతదేశం మీద  చంద్రగుప్తుడి ఆధిపత్యాన్ని తెలుపుతుంది. 

*●భట్టిఫ్రోలు శాసనం:*
కుబేరకుడనే యక్షరాజు వేయించాడు. శాతవాహనుల కాలంలో నిగమసభల గురించి ఈ శాసనం తెలుపుతుంది.

*●కాజీపేట శాసనం:*
మోదటి  బ్రేతరాజును ప్రధమ కాకతీయ రాజుగా
పేర్కొన్నది.

శాతవాహనుల శాసనాలు:
ఇవన్నీ ప్రాకృతిక భాషలోను మరియు బ్రాహ్మి లిపిలోను ఉన్నాయి.

*●ఉత్తర మేరూర్ శాసనం:*
మొదటి పరాంతకుని గురించి తెలుపును. ఈ శాసనం దక్షిణ భరతదేశంలో చోళుల కాలంలో గ్రామీణ ప్రభుత్వాలు వర్దిల్లాయని  తెలుపుతుంది.

శాసనాలు
మోదటి  బ్రేతరాజును ప్రధమ కాకతీయ రాజుగా
పేర్కొన్నది.

శాతవాహనుల శాసనాలు:
ఇవన్నీ ప్రాకృతిక భాషలోను మరియు బ్రాహ్మి లిపిలోను ఉన్నాయి.

*●అద్దంకి శాసనం:*
పాండురంగడు వేయించిన తొలి తెలుగు శాసనం.

తెలుగు, తమిళ  భాషలు కలిపి వేయించిన శాతవాహన రాజు వాసిస్టీపుత్ర శాతకర్ణి.
              🍃🌷🤗🌷🍃

no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv