550 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు జారీ

550 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు జారీ

వివిధ ప్రభుత్వశాఖల్లో ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ మరో ఐదు నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ల ద్వారా 550 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఏపీపీఎస్సీ జారీ చేసిన నోటిఫికేషన్లలో అటవీశాఖ సెక్షన్‌ ఆఫీసర్లు 50, పారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్లు 330, అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్లు 100 ఉన్నాయి. వీటితో పాటు గిరిజన, బీసీ సంక్షేమశాఖలో హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్లు 28, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ విభాగంలో డిప్యూటీ సర్వేయర్లు 29, ఏపీ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌లో 18 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యాయి.

అటవీశాఖ ఉద్యోగాలకు మార్చి 5 నుంచి 27 వరకు, హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్లకు ఈనెల 27 నుంచి మార్చి20 వరకు, డిప్యూటీ సర్వేయర్‌ పోస్టులకు ఈనెల 20 నుంచి మార్చి 13 వరకు, ఏపీ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ పోస్టులకు ఈనెల 19 నుంచి మార్చి 13 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. అభ్యర్థుల కమిషన్‌ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఏపీపీఎస్సీ తెలిపింది.


EmoticonEmoticon