AP History - Sathavahana, Ikshwaka Multiple choice questions for APPSC Exams

శాతవాహనులు, ఇక్ష్వాకులు

1. గ్రంథాలు, వాటి రచయితలకు సంబంధించి కింది వాటిలో సరికాని జత? (Group-II, 2003)
  1) గాథాసప్తశతి - హాలుడు
 2) బుద్ధచరితం - నాగార్జునుడు
 3) కామసూత్రం - వాత్స్యాయనుడు
 4) బృహత్కథ - గుణాఢ్యుడు

View Answer

సమాధానం: 2

2. అశోకుడి శిలా శాసనాలను ఏ లిపిలో చెక్కారు? (Gazetted, 2005)
 1) పాళీ
 2) ఖరోష్టి
 3) బ్రాహ్మి
 4) దేవనాగరి

View Answer

సమాధానం: 3

3.‘కవివత్సలుడు’ అనేది ఎవరి బిరుదు?(Group-II, 2008)
 1) గౌతమీపుత్ర శాతకర్ణి
 2) హల శాతవాహనుడు
 3) మూడో మాధవ వర్మ
 4) రాజరాజ నరేంద్రుడు

View Answer

సమాధానం: 2

4. ‘ఆంధ్ర’ అనే పదాన్ని తొలిసారిగా ఏ గ్రంథంలో ప్రస్తావించారు?
 1) రుగ్వేదం
 2) సామవేదం
 3) ఐతరేయ బ్రాహ్మణం
 4) మాండ్యూకోపనిషత్తు

View Answer

సమాధానం: 3

5. ఆంధ్ర ప్రాంతాన్ని ‘త్రిలింగ దేశం’ అని తొలిసారిగా ఏ గ్రంథంలో ప్రస్తావించారు?
 1) భీమసేన జాతకం
 2) శక్తి సంగమ తంత్రం
 3) సెరివణిజ జాతకం
 4) సింహళ జాతకం

View Answer

సమాధానం: 2

6. పురాణాల్లో పేర్కొన్న ‘ఆంధ్ర భృత్యులు’, శాతవాహనులు ఒక్కరేనని అభిప్రాయపడిన చరిత్రకారుడు ఎవరు?
 1) విష్ణువాసుదేవ మిరాశీ
 2) వి.ఎన్. సుక్తాంకర్
 3) పి.టి. శ్రీనివాస అయ్యంగార్
 4) ఆర్.జి. భండార్కర్

View Answer

సమాధానం: 4

7. శాతవాహన రాజులు వారి పేర్ల ముందు మాతృ గోత్ర నామాలను చేర్చుకునే పద్ధతి ఎవరి కాలంలో ప్రారంభమైంది?(Group-II, 2008)
 1) గౌతమీపుత్ర శాతకర్ణి   
 2) శ్రీముఖుడు
 3) వాసిష్టీపుత్ర పులోమావి
 4) హాలుడు

View Answer

సమాధానం: 1

8. ‘ఓడ ముద్రలు’ ఉన్న సీసపు నాణేలను ముద్రించిన శాతవాహన రాజు ఎవరు?
 1) హాలుడు
 2) యజ్ఞశ్రీ శాతకర్ణి
 3) రెండో పులోమావి
 4) కుంతల శాతకర్ణి

View Answer

సమాధానం: 2

9. కింద పేర్కొన్న వారిలో ఎవరిని శాతవాహన పాలనా స్థాపకుడిగా గుర్తించారు? (Group-II, 2008)
 1) మొదటి శాతకర్ణి
 2) సిముఖుడు
 3) కుంతల శాతకర్ణి
 4) గౌతమీపుత్ర శాతకర్ణి

View Answer

సమాధానం: 4

10. కింది వాటిలో ఖారవేలుడు వేయించిన శాసనం ఏది?(Group-I, 1991)
 1) నాసిక్ గుహ శాసనం
 2) నానాఘాట్
 3) అమరావతి
 4) హాతిగుంఫా

View Answer

సమాధానం: 4

11. ‘అమరావతి స్తూపం’ను ఎవరి కాలంలో నిర్మించారు?(Group-II, 2008)
 1) ఇక్ష్వాకులు
 2) శాతవాహనులు
 3) విష్ణుకుండినులు
 4) శాలంకాయనులు

View Answer

సమాధానం:2

12.‘నానాఘాట్’ శాసనాన్ని వేయించింది ఎవరు?(Gazetted, 2009)
 1) గౌతమీ బాలాశ్రీ
 2) గౌతమీపుత్ర శాతకర్ణి
 3) దేవీ నాగానిక
 4) రెండో శాతకర్ణి

View Answer

సమాధానం: 3

13. ‘గాథాసప్తశతి’ ప్రాకృత పదాల్లో ప్రధాన అంశం ఏది? (Civils Prelims, 2002)
 1) జానపద పదాల వివరణ
 2) శృంగార పదాల వివరణ
 3) చిలుక చెప్పిన కథలు
 4) పురాణాల కథనం

View Answer

సమాధానం: 2

14. గౌతమీపుత్ర బాలాశ్రీ నాసిక్ శాసనాన్ని ఎవరి పాలనా కాలంలో వేయించారు?(Group-II, 2008)
 1) గౌతమీపుత్ర శాతకర్ణి
 2) వాసిష్టీపుత్ర పులోమావి
 3) సుందర శాతకర్ణి
 4) శివశ్రీ శాతకర్ణి

View Answer

సమాధానం: 2

15.నహపాణుడిని ఓడించిన శాతవాహన రాజు ఎవరు? (Group-I, 1994)
 1) సిముఖుడు
 2) యజ్ఞశ్రీ శాతకర్ణి
 3) రెండో శాతకర్ణి
 4) గౌతమీపుత్ర శాతకర్ణి

View Answer

సమాధానం: 4

16. శాతవాహనులు ఆంధ్రులు కారని, ఆంధ్రులకు భృత్యులని వాదించిన పండితుడు ఎవరు?  (Group-II, 2008)
 1) ఆర్.జి. భండార్కర్
 2) వి.ఎన్. సుక్తాంకర్
 3) రాప్సన్
 4) గోపాలాచారి

View Answer

సమాధానం: 1

17. గౌతమీపుత్ర శాతకర్ణి సాధించిన సైనిక విజయాలను తెలిపే శాసనం ఎక్కడ ఉంది?(Group-II, 2008)
 1) పితల్ కోరా
 2) నాసిక్
 3) నానాఘాట్
 4) జున్నార్

View Answer

సమాధానం: 2

18. శాతవాహనులకు చెందిన ఏ పాలకుడి కాలంలో ప్రాకృత భాష స్థానంలో ‘సంస్కృతం’  రాజభాషగా మారింది?
 1) శ్రీముఖుడు
 2) గౌతమీపుత్ర శాతకర్ణి
 3) హాలుడు   
 4) కుంతల శాతకర్ణి

View Answer

సమాధానం: 4

19. మధ్యప్రదేశ్‌లోని సాంచీ స్తూపానికి దక్షిణ తోరణాన్ని నిర్మించిన శాతవాహన రాజు ఎవరు?
 1) మొదటి శాతకర్ణి
 2) గౌతమీపుత్ర శాతకర్ణి
 3) యజ్ఞశ్రీ శాతకర్ణి
 4) రెండో శాతకర్ణి

View Answer

సమాధానం:4

20. శకరాజైన విదేశీయుడు మొదటిసారిగా  సంస్కృత భాషలో వేయించిన శాసనం ఏది?
 1) గిర్నార్ శాసనం
 2) నాసిక్ శాసనం
 3) హాతిగుంఫా శాసనం
 4) నానాఘాట్ శాసనం

View Answer

సమాధానం:1

21. ప్రముఖ వర్తక కేంద్రం ‘ప్రతిష్టానపురం’ ఏ నది తీరాన ఉంది?(Gazetted, 2005)
 1) కృష్ణా
 2) నర్మద
 3) గోదావరి
 4) తుంగభద్ర

View Answer

సమాధానం: 3

22. మాకడోని శాసనంలో పేర్కొన్న ‘గుల్మిక’ పదానికి అర్థం? (Group-II, 2008)
 1) గ్రామపెద్ద
 2) బానిస
 3) వాణిజ్య సుంకం
 4) భూస్వామ్య ప్రభువు

View Answer

సమాధానం: 1

23. గ్రంథాలు, వాటి రచయితలకు సంబంధించి కింది వాటిలో సరికాని జత? (Group-I, 2003)
 1) బృహత్కథ - గుణాఢ్యుడు
 2) గాథాసప్తశతి - హాలుడు
 3) హర్షచరిత్ర - బాణుడు
 4) రాజశేఖర చరితం - మల్లన

View Answer

సమాధానం: 4

24. అతి ప్రాచీన శివాలయంగా పరిగణించే పరశురామేశ్వరాలయం ఎక్కడ ఉంది?(Group-II, 2008)
 1) తొండవాడ
 2) గుడిమల్లం
 3) రేణిగుంట
 4) జోగుల మల్లవరం

View Answer

సమాధానం: 2

25.ఆంధ్ర రాజ్యంలో ఏ పట్టణాన్ని గొప్ప మార్కెట్‌గా టాలెమీ వర్ణించాడు? (Gazetted, 2005)
 1) మైసోలియా (మచిలీపట్నం)
 2) నిజాం పట్నం
 3) కళింగ పట్నం
 4) కోటిలింగాల

View Answer

సమాధానం: 1

26. మధ్యయుగ భారతదేశంలో రసాయన శాస్త్ర ప్రక్రియలను తెలిపే ‘రసరత్నాకరం’ అనే గ్రంథాన్ని ఎవరు రచించారు?(Gazetted, 2005)
 1) నాగార్జున సిద్ధుడు
 2) వాగ్భటాచార్యుడు
 3) మాధవాచార్యుడు
 4) నిత్యనాథ సిద్ధుడు

View Answer

సమాధానం: 1

27.శాతవాహనుల కాలం నాటి సామాజిక ఆర్థిక, మత పరిస్థితులకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?(Group-II, 2008)
 1) శాతవాహనులు హిందూ మతాన్ని అనుసరించినప్పటికీ వారి రాజుల్లో కొందరు బౌద్ధమతాన్ని పోషించారు.
 2) చాతుర్వర్ణ వ్యవస్థ అమల్లో ఉంది.
 3) స్త్రీలను తక్కువగా చూసేవారు.
 4) నౌకాయానం అభివృద్ధి దశలో ఉంది.

View Answer

సమాధానం: 3

28. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చిహ్నం ‘పూర్ణకుంభం’ను దేని నుంచి గ్రహించారు?
 1) నాగార్జున కొండ శిల్పం
 2) కాకతీయ శిల్పం
 3) విజయనగర శిల్పం
 4) అమరావతి శిల్పం

View Answer

సమాధానం: 4

29. ‘కథాసరిత్సాగరం’ రచయిత ఎవరు?
 1) ధనపాలుడు
 2) సోమదేవసూరి
 3) క్షమేంద్రుడు
 4) హాలుడు

View Answer

సమాధానం: 2

30.‘స్కంధా వారం’ దేన్ని సూచిస్తుంది?
 1) సైనిక శిబిరం
 2) భోజన శాల
 3) వ్యాపార కేంద్రం
 4) విద్యా శాల

View Answer

సమాధానం: 1

31. ‘దక్షిణ భారతదేశ మనువు’గా ఎవరిని అభివర్ణిస్తారు?
 1) అగస్త్యుడు
 2) ఆపస్తంభుడు
 3) రామానుజుడు
 4) ధర్మకీర్తి

View Answer

సమాధానం: 2

32. ‘కులరికలు’ పదం దేన్ని సూచిస్తుంది?
 1) వ్యాపారులు
 2) కుమ్మరివారు
 3) చర్మకారులు
 4) ఔషధాలు తయారు చేసేవారు

View Answer

సమాధానం: 2

33. ‘సార్థవాహులు’ అంటే?
 1) ధనికులు   
 2) వ్యవసాయదారులు
 3) యంత్రాలు తయారుచేసేవారు
 4) వస్తువులను ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తీసుకెళ్లి వర్తకం చేసేవారు

View Answer

సమాధానం: 4

34.శాతవాహనుల కాలంలో రాజు ఆదేశాలను అమలు చేసే ‘సచివాలయం’ కార్యాలయం పేరు?
 1) గ్రామేయ
 2) నిగమసభ
 3) అక్షపటల
 4) స్కంధావారం

View Answer

సమాధానం: 3

35.దక్షిణ భారతదేశ చరిత్రలో తొలిసారిగా బ్రాహ్మణులు, బౌద్ధ బిక్షువులకు భూదానా లు చేసిన రాజవంశం ఏది?
 1) ఇక్ష్వాకులు
 2) విష్ణుకుండినులు
 3) కాకతీయులు
 4) శాతవాహనులు

View Answer

సమాధానం: 4

36. శాతవాహనుల కాలంలో వృత్తిపనివారు చెల్లించే సుంకం?
 1) ఇక్తా
 2) భోగ పన్ను
 3) కురుకుర
 4) దేయభోగం

View Answer

సమాధానం: 3

37. ఇక్ష్వాకుల రాజ్య స్థాపకుడు ఎవరు?
 1) రుద్ర పురుష దత్తుడు
 2) శ్రీ వీర పురుష దత్తుడు
 3) వాసిష్టీపుత్ర శ్రీ చాంతమూలుడు
 4) ఎహూవల చాంతమూలుడు

View Answer

సమాధానం: 3

38.ఇక్ష్వాకుల వంశానికి చెందిన ఏ రాజు కాలంలో ఆంధ్ర దేశం బౌద్ధ మతానికి  స్వర్ణ యుగంగా వర్ధిల్లింది?
 1) చాంతమూలుడు
 2) రుద్ర పురుషదత్తుడు
 3) ఎహూవల చాంతమూలుడు
 4) శ్రీ వీర పురుషదత్తుడు

View Answer

సమాధానం: 4

39. భారతదేశ చరిత్రలో తొలిసారిగా దేవాలయాలను నిర్మించిన రాజవంశం ఏది?
 1) శాతవాహనులు
 2) గుప్తులు
 3) ఇక్ష్వాకులు
 4) మౌర్యులు

View Answer

సమాధానం:3

40. సంస్కృత భాషలో శాసనాలు వేయించిన తొలి ఇక్ష్వాక రాజు ఎవరు?
 1) ఎహూవల చాంతమూలుడు
 2) శ్రీ వీర పురుషదత్తుడు
 3) రుద్ర పురుషదత్తుడు
 4) వాసిష్టీపుత్ర శ్రీ చాంతమూలుడు

View Answer

సమాధానం: 1

41. బృహత్పలాయనుల వంశ చరిత్రను తెలిపే ఏకైక శాసనం ఏది?
 1) నాగార్జున కొండ శాసనం
 2) మంచికల్లు శాసనం
 3) కొండముది తామ్ర శాసనం
 4) తుండి శాసనం

View Answer

సమాధానం: 3

42. శాలంకాయనుల ఆరాధ్య దైవం ఎవరు?
 1) ఇంద్రుడు
 2) చిత్రరథ స్వామి
 3) విష్ణువు
 4) నందీశ్వరుడు

View Answer

సమాధానం: 2

43. ‘శ్రీ పర్వత స్వామి’ని కులదైవంగా స్వీకరించిన రాజవంశం ఏది?
 1) శాతవాహనులు
 2) ఇక్ష్వాకులు
 3) శాలంకాయనులు
 4) విష్ణుకుండినులు

View Answer

సమాధానం: 4

44. ‘చేజర్ల కపోతేశ్వరాలయం’ నిర్మించిన రాజవంశం ఏది?
 1) ఆనంద గోత్రీయులు
 2) విష్ణుకుండినులు
 3) ఇక్ష్వాకులు
 4) శాతవాహనులు

View Answer

సమాధానం: 1

45. ఉండవల్లి గుహలు (5),  నెల్లూరులోని భైరవుని కొండ గుహలు (8), విజయవాడలోని మొగల్రాజపురం గుహాలయాలను నిర్మించిన రాజవంశం ఏది?
 1) శాతవాహనులు
 2) ఇక్ష్వాకులు
 3) వాకాటకులు
 4) విష్ణుకుండినులు

View Answer

సమాధానం: 4

46. ‘ప్రమాణ సముచ్ఛయం’ గ్రంథ రచయిత ఎవరు?
 1) నాగార్జునుడు
 2) బుద్ధ పాలితుడు
 3) దిగ్నాగుడు
 4) భావ వివేకుడు

View Answer

సమాధానం: 3

47. ‘పర్ణిక శ్రేణి’ అని ఏ సంఘాన్ని పిలుస్తారు?
 1) మిఠాయిలు చేసేవారి సంఘం
 2) తమలపాకులు అమ్ముకునే వారి సంఘం
 3) కుమ్మరి పనిచేసే వారి సంఘం
 4) సాలెపని వారి సంఘం

View Answer

సమాధానం: 2

48. ఆంధ్ర దేశంలో ‘సింహళ విహారం’ను ఎక్కడ నిర్మించారు?
 1) ధాన్యకటకం
 2) ఘంటసాల
 3) జగ్గయ్యపేట
 4) నాగార్జున కొండ

View Answer

సమాధానం: 4

49. శాలంకాయనుల రాజ లాంఛనం ఏది?
 1) నందీశ్వరుడు
 2) సింహం
 3) ఎద్దు
 4) చేప

View Answer

సమాధానం: 3

50. ‘ఘటికలు’ అంటే ఏమిటి?
 1) ఉన్నత విద్యాసంస్థలు
 2) గురుకుల పాఠశాలలు
 3) సంఘాలు
 4) నాటికలు

View Answer

సమాధానం: 1

51. బెజవాడలోని ‘అక్కన్న - మాదన్న’ గుహలను ఏ రాజవంశ కాలంలో తొలిచారు?
 1) ఇక్ష్వాకులు
 2) పల్లవులు
 3) శాలంకాయనులు
 4) విష్ణుకుండినులు

View Answer

సమాధానం: 4

52. విష్ణుకుండినుల కాలం నాటి ప్రఖ్యాతిగాంచిన గుహలు కింద పేర్కొన్న ఏ ప్రాంతంలో ఉన్నాయి?
 1) భైరవకొండ
 2) బేతంచర్ల
 3) ధూళికట్ట
 4) ఉండవల్లి - మొగల్రాజపురం

View Answer

సమాధానం: 4



no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv